నిరుపేదల కు తక్కువ ఫీజుతో నాణ్యమైన వైద్యం అందించాలి: డాక్టర్ సుబ్బారావు
ప్రజా దీవెన ,కోదాడ: వైద్యం నిమిత్తం హాస్పిటల్ కి వచ్చే నిరుపేదలకు వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో తక్కువ ఫీజులతో నాణ్యమైన వైద్యం నిర్వాహకులు అందించాలని కోదాడ ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు అన్నారు గురువారం పట్టణంలోని స్థానిక ఆజాద్ నగర్ సూర్య ల్యాబ్ దగ్గర కేపీ కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటుచేసిన ర్రాకేష్ డెంటల్ హాస్పటల్ ను నిర్వాహకులు కే జోసఫ్, డాక్టర్ రాకేష్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ సుబ్బారావు, టీజీ పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ పాల్గొని హాస్పటల్ ను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ కోదాడ పట్టణం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో కోదాడ పట్టణంలో అధునాతన పరికరాలతో రాకేష్ డెంటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు కోదాడ ప్రాంత ప్రజలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన హాస్పిటల్స్ సేవలను సద్వినియోగం చేసుకొని పళ్ళ సమస్యలను లేకుండా మంచి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని తెలిపార. హాస్పటల్
ఈ కార్యక్రమములో కోదాడ వైద్యులు సూర్యనారాయణ, శ్రీనివాసరావు సురేష్ కుమార్, శ్రావణ్ కుమార్, కోదాడ మాజీ సర్పంచ్ వెర్నేని బాబు కాంగ్రెస్ జిల్లా నాయకులు పార,సీతయ్య, కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు వార్డు కౌన్సిలర్లు గుండెల సూర్యనారాయణ, గంధం యాదగిరి వివిధ పార్టీలకు చెందిన నాయకులు ,కోదాడ ప్రాంత పాస్టర్లు, శ్రేయోభిలాషులు, బంధువులు, తదితరులు పాల్గొన్నారు.