Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Meteorological Department Alert: వాతావరణ శాఖ కీలక అప్డేట్…ఈ వారంలో 3 నుంచి 5 డిగ్రీల దాకా పడిపోయే అవకాశం

ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో రాబోయే వారం రోజుల్లో చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమో దయ్యే అవకాశం ఉందని వెల్ల డించింది. రాబోయే నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగా ణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయగా.. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ఇచ్చింది. మిగతా జిల్లాల్లో సాధారణం కన్నా కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతా యని తెలిపింది. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు పొగమం చు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

హైదరాబాద్ సిటీలో రెండు రోజులు మబ్బు పట్టి ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుందని తెలి పింది.టెంపరేచర్లు తక్కువగా రికా ర్డయ్యే జిల్లాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచి స్తున్నారు. చలి నుంచి రక్షించుకునే దుస్తులు వేసుకోవాలని చెబుతు న్నారు. మరోవైపు మంగళవారం రాత్రి ఆదిలాబాద్లో అత్యల్పంగా 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డ యింది. నిరుడు ఇదే రోజు 11.2 డిగ్రీల టెంపరేచర్ నమోదవగా ఇప్పుడు చలి ఎక్కువగా ఉన్నది.
ఆసిఫాబాద్ జిల్లాలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

అంతకుముందు ఏడాది ఇదే రోజు అక్కడ 10.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. నిర్మల్ జిల్లాలో 11.5, జగిత్యాల జిల్లాలో 12.3, సంగా రెడ్డిలో 13, పెద్దపల్లిలో 13.1, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో 13.2, కామారెడ్డిలో 13.3, భూపాలప ల్లిలో 13.4 డిగ్రీల మేర టెంప రేచర్లు నమోదయ్యాయి. హైదరా బాద్లో అత్యల్పంగా మౌలాలిలో 14.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.