ప్రజా దీవెన,కోదాడ: పట్టణంలోని స్థానిక జేవిఎస్ ఉపాధ్యాయులు జగ్గు నాయక్ నివాస గృహంలో పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో సెమీ క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు పాల్గొని కేక్ కట్ చేసి క్యాండిల్ లైట్ సర్వీసును నిర్వహించారు క్రైస్తవ భక్తులకు ముందుగా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పాస్టర్ యెసయ్య మాట్లాడుతూ ఏసుక్రీస్తు ప్రేమను శాంతిని ప్రపంచ మానవాళికి బోధించిన గొప్ప మహనీయుడని కొనియాడారు తెలిపారు అలాగే క్రిస్టమస్ పండుగ గూర్చి, ఏసుక్రీస్తు జననం యొక్క ఆవశ్యకతను తెలిపారు వచ్చిన భక్తులందరికీ జగ్గు నాయక్ ప్రేమవిందు ఏర్పాటు చేశారు, సెమి క్రిస్టమస్ వేడుకలలో కాంగ్రెస్ క్రీస్టియన్ కో ఆప్షన్ సభ్యురాలు వంటెపాక జానకి యేసయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు సైదానాయక్. హెడ్ కానిస్టేబుల్ జాన్ , విజయానంద్ , తబిత, రాణి మోహన్, సీత, ప్రామిల తదితరులు పాల్గొన్నారు.