ప్రజాదీవెన, నల్గొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న 10 రోజుల రీసర్చ్ మెథడాలజీ కోర్సులో భాగంగా నేడు భూదాన్ పోచంపల్లి క్షేత్రస్థాయి పర్యటన చేశారు.
ఈ పర్యటనలో టై అండ్ డై కార్మికుల జీవన స్థితిగతులపై అధ్యయనం చేశారు. చేనేత కార్మికుల అంశాలను ప్రభుత్వ ముందు ఉన్న సవాళ్లను సంఘ ప్రతినిధులు వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, డా మిరియాల రమేష్, డా దోమల రమేష్, తదితరులు పాల్గొన్నారు.