ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గణిత శాస్త్రానికి శ్రీనివాస రామానుజన్ చేసిన సేవలు ఎనలేనివని స్రవంతి స్కూల్ కర స్పాండెంట్ వారణాసి రజనికాంత్ శర్మ అన్నారు. సోమవారం గణిత దినోత్సవం సందర్భంగా పాఠశాల లో గణిత శాస్త్రంపై విద్యార్థులు రూపొందించిన గణిత ప్రాజెక్టులు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్య జీవితంలో గణితం ఎంతో అవసరమని అన్నా రు.
ఎంతో మంది విద్యార్థులు గణితంలో తమ ప్రతిభను అద్బు తంగా సష్టించారని సులభంగా అర్థమయ్యేలా నమూనాలు రూపొందించారన్నారు. శ్రీనివాస రామానుజన్ను స్పూర్తిగా విద్యార్థులు గణితంపై జీవితంలో పైకి రావాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటరమణ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
