Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: మాతాశిశు సంరక్షణ మామాన వత్వ బాధ్యత

–నల్గొండ నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి ప్రతీక్ ఫౌండేషన్ ఉదారత
–రూ.30 లక్షల నిధులతో అధు నాతన సౌకర్యాల ఏర్పాటు
–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ: నవజాత శిశు సంరక్షణలో భాగంగా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుప త్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో అధునాతన సౌకర్యాల ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి తెలిపారు.బుధవారం అయన ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నూత నంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభిం చారు.ఈ కేంద్రంలో ప్రతీక్ ఫౌండేష న్ ద్వారా ఒక్కొక్కటి 90 వేల రూ పాయల విలువ చేసే 15 నైస్ నియోటెక్ వార్మర్లను , ఒక్కొక్కటి 30 వేల రూపాయల విలువ కలి గిన 10 నియో ఫోటో తెరఫీ సింగిల్ సర్ఫేస్ యూనిట్లను, రెండు లక్షల 50 వేల రూపాయల విలువ కలిగి న 10 ఆకాష్ సైరింగ్ పంపులను , నాలుగున్నర లక్షల రూపాయల విలువ కలిగిన 5 నెల్ కార్ పల్స్ ఆక్స్లో మీటర్లను, 5 లక్షల రూపాయల విలువ కలిగిన. 2 ట్రాన్స్క్యూటేనియస్ బిలురు బినేటర్లు , 100 మిట్టర్లు,100 బూటీలు , 200 స్వద్దేస్ బ్లాంకె ట్లు,4 బబుల్ సిపిఎపి కంప్రెసర్లు, మూడు నియోనటల్ రెస్క్యూ టేషన్ కిట్లు, ఎన్ఐబిపి నాలుగు యూనిట్లు, 13 లీటర్ల ఆటో clave ,4 రూమ్ టెంపరేచర్ థర్మామీటర్లు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది.

అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జనాభా కలిగిన జిల్లా నల్గొండ అని అన్నారు.జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రికి ప్రతిరోజు 1500 మంది అవుట్ పేషెంట్లు, వెయ్యి మందికి పైగా ఇన్ పేషెంట్లు వస్తారని ,ఇక్కడ ప్రతి నెల 600 డెలివరీలు అవుతాయని చెప్పారు. 12 సంవత్సరాల క్రితం తాను ఎం ఎల్ ఏ గా ఉన్న సమయంలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, తిరిగి మళ్ళీ ఇప్పుడు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 లక్షల రూపాయల విలువ కలిగిన అధునాతన పరికరాలు నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లలకు జాండీస్ రావడం, తక్కువ బరువుతో పుట్టడం, తల్లిపాలు తీసుకోలేకపోవడం, అలాగే తల్లులు పిల్లలకు వివిధ కారణాలవల్ల వెంటనే పాలు ఇవ్వలేకపోవడం వంటి వాటన్నిటిని కొత్తగా ఏర్పాటు చేసే ఈక్విప్మెంట్ ద్వారా అధిగమించవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు డెలివరీలతో పాటు, చిన్నపిల్లలకి అత్యవసర వైద్య చికిత్సలు అందించడం వల్ల 60 నుండి 70 వేల రూపాయల ఖర్చు ను మిగిలించి పేదవారికి ఉపయోగపడవచ్చు అని తెలిపారు.

నూతనంగా నిర్మిస్తున్న కొత్త భవనంలో ఒక ఫ్లోర్ మొత్తం ప్రసవాల కోసం ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు .నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని పూర్తిగా ఉస్మానియా, నీలోఫర్ లాగా అవసరమైన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తామని, ప్రైవేట్ హాస్పిటల్లో లేనివిధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలన్నదే తమ ఆలోచనని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుండి పల్స్ ఆక్స్ మీటర్లు తెప్పిస్తున్నామని, అలాగే అదనంగా నాలుగు వెంటిలేటర్లు తెప్పిస్తున్నామని, బేబీ కేర్ యూనిట్లో 200 వెల్వెట్ టవల్స్ తెప్పిస్తున్నట్లు తెలిపారు. మార్చ్ లోగా క్రిటికల్ కేర్ యూనిట్ పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. జిల్లాకు ఇటీవల అధునాతన 108 అంబులెన్స్ వాహనాలు వచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. వచ్చే వారం నుండి గురుకులాలను తనిఖీ చేస్తామని, విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు, ఇతర వసతులను పరిశీలించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ వివిధ రకాల ఇన్ఫెక్షన్ల వల్ల నవజాత శిశువులకు ఇబ్బందులు కలుగుతుందని, అందువల్ల వారి ఆరోగ్య సంరక్షణలో భాగంగా నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో వివిధ రకాల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యంగా 20 బేబీ వార్మింగ్ మిషిన్లు, 10 ఫోటో తెరఫీ యూనిట్లు, రెండు హాస్పిటల్ గ్రేడ్ బ్రెస్ట్ పంపులు, మిల్క్ ఎక్స్ప్రెషన్స్ వంటి ఏర్పాటు చేయడం వల్ల అప్పుడే పుట్టిన పిల్లలకు ఎంతో మేలు కలుగుతుంది అన్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు చాలా అవసరమని, మొదటిసారిగా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఈ బ్రెస్ట్ పంపులు ఏర్పాటు చేశామని ,అలాగే చిన్నపిల్లల ఐసీయూ ను 50 పడకలకు నుండి 80 కి పెంచడం జరిగిందని, అంతేకాక రోగుల సహాయకుల కోసం వెయిటింగ్ రూమ్ మంజూరు చేయడం జరిగిందని, 40 స్క్వేర్ ఫీట్ లో క్రిటికల్ కేర్ యూనిట్ను నిర్మిస్తున్నామని దీనివల్ల అంటినేటల్ చెకప్ లు, టెస్టులు నిర్వహించవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, చిన్న పిల్లల విభాగం అధిపతి డాక్టర్ వందన, ఇన్చార్జి సూపరింటిండెంట్ డాక్టర్ నగేష్ తదితరులు ఉన్నారు.