కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి
మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 28 మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అకాల మరణం దేశం గొప్పఆర్థిక వ్యక్తిని కోల్పోయిందని కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి అన్నారు ఆయన శుక్రవారం రోజున తన నివాసంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ విదేశాల కార్యదర్శిగా పనిచేసీ సేవలందించారని కాంగ్రెస్ పార్టీకి 33 ఏళ్లుగా చురుకుగా పని చేశారని పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా దేశాన్ని ముందంజలో ఉంచాలని పట్టుదలతో మొండిగా ఆర్థిక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.
పాకిస్తాన్లో జన్మించి భారత్ పాకిస్తాన్ ఏర్పాట్లు భాగంగా భారతదేశనికి కుటుంబాన్ని సాహసంగా మార్చి భారత దేశంలో జీవనం సాగించి దేశానికి సేవలు చేశారని అన్నారు ఆయన అకాల మరణం తీరనిలోటని ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు ఆయన వెంట మాజీ వార్డ్ మెంబర్లు పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గుండెబోయిన సత్తయ్య బచ్చనబోయిన బిక్షం కప్పరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు