Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

AllamNarayana : జర్నలిస్టులకు నిధిని సృష్టించిందే టీయూడబ్ల్యూజే

–జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమ స్యపై సమరశీల పోరాటాలు
–టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్)హెచ్ -143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ

AllamNarayana ప్రజా దీవెన, కొత్తగూడెం: తెలంగా ణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడింది టీయూడబ్ల్యూజేనని, జర్నలి స్టులకు ప్రత్యేక నిధిని సాధించింది, రికార్డు స్థాయిలో 20,300 పై చిలు కు అక్రిడేషన్లు అందజేసిన ఘనత కూడా tuwj కే దక్కుతుందని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్)హెచ్ -143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ పేర్కొన్నారు. కరోనా సమయంలో రూ.7కోట్ల ఆర్థిక సాయం అందజేయడమే కాకుండా రాష్ట్రంలో దాదాపు 450 జర్నలి స్టుల కుటుంబాల్లో పింఛన్ అంద జేసి వెలుగులు నింపామని గుర్తు చేశారు. స్వరాష్ట్రానికై ఆంధ్రా యజమానులు చేతుల్లో నుంచి పెద్ద పదవులను సైతం కాదని బయటి వచ్చి పోరాటం చేశామని, ఆంధ్రా పెత్తందారీ యూనియన్లతో ఒరిగేదేమీ లేదని, జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.

సోమ వారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమో దు కార్యక్రమం జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి మహమ్మద్ షఫీ సమ క్షంలో కొత్తగూడెంలో ప్రారం భించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సభలో అల్లం నారాయ ణ మాట్లాడుతూ 15 ఏండ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో టీయూడబ్ల్యూజే పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు. జర్నలిస్టులకు రూ.42కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంతో పాటు గా కరోనా లాంటి విపత్కర సమ యాల్లో రూ.10వేలు, రూ.20వేలు చొప్పున రూ.7కోట్ల ఆర్థిక సాయం కేవలం ఆధార్ కార్డు ద్వారా అంద జేశామని తెలిపారు. ఖమ్మం, కొత్త గూడెం జిల్లాల్లో జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు సంబంధించి ప్రత్యేక జీవో సైతం వచ్చిందని, కానీ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నిలిచిపో యా యని, ఇండ్ల స్థలాల సమస్యను వదిలిపెట్టేది లేదని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్య దర్శి మారుతి సాగర్, రాష్ట్ర ఉపా ధ్యక్షులు రమేష్ హజరే, రాష్ట్ర కోశా ధికారి యోగానంద్, టెంజూ రాష్ట్ర అధ్యక్షులు విష్ణు, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కాగితపు వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఐజేయూ సభ్యులు చండ్ర నరసింహారావు, గుర్రం రాజేష్, టెంజూ జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి, జిల్లా కార్యదర్శి శ్రీహరి, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.