Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vijayanand: ఏపీ సిఎస్ గా బాధ్యతలు స్వీకరిం చిన కె.విజయానంద్

ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిగా కె.విజయానంద్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సాయంత్రం వేదపండితుల ఆశీర్వచనాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకూ సిఎస్ గా పని చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో సిఎస్ గా విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు.1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయా నంద్ ను ఎపి నూతన సిఎస్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సాధా రణ పరిపాలన శాఖ జిఓఆర్టి సంఖ్య 2209 ద్వారా డిసెంబరు 29న ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో ఆయన సిఎస్ గా బాధ్యతలు చేపట్టారు.

1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయా నంద్ 1993లో ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్ లో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెం ట్ కలెక్టర్‌గా తన ఉద్యోగ ప్రస్తా నాన్ని ప్రారంభించా రు.ఆతర్వాత 1996 వరకు రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా పనిచేశారు.1996 నుండి గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరె క్టర్‌గా పనిచేశారు.1998 నుండి 2007 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదే శ్‌లో రంగారెడ్డి,శ్రీకాకుళం, నల్గొండ జిల్లాలకు జాయింట్ కలెక్టర్‌గా పని చేశాడు.2007 నుండి 2008 వర కు ప్రణాళిక మరియు కార్యక్రమాల అమలు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.2008 నుండి 2009 ఎపి ట్రాన్సుకో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.అదే విధంగా 2016 నుండి 2019 వరకు ఎపి జెన్కో మేనేజింగ్ డైరెక్టర్‌గా,ఎపి ట్రాన్సుకో సిఎండిగా ద్వంద్వ పాత్రలను నిర్వహించారు.

2019 నుండి 2021 వరకు రాష్ట్రంలోని కీలకమైన ఎన్నికల ప్రక్రియలను పర్యవేక్షిస్తూ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీ సర్ & ఎక్స్-అఫీషియో ప్రిన్సి పల్ సెక్రటరీగా పనిచే శారు.2023 నుండి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ పని చేస్తున్నారు.అంతేగాక ఇదే సమ యంలో ఎపిపిసిసి, ఎపిఎస్పి సిఎల్,ఎన్ఆర్ఇడిక్యాప్,ఎపిఎస్ఇసిఎం ల చైర్మన్ గా కూడా అదనపు బాధ్యతలను కూడా నిర్వహిం చారు.అంతేగాక 2023-24 సంవత్సరానికి సదరన్ రీజనల్ పవర్ కమిటీ (SRPC) చైర్‌పర్స న్‌గా కూడా విజయానంద్ పనిచే శారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి తో కూడిన మార్గదర్శకత్వం లో విజయానంద్ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ -2024ను రూపొందించి నోటిఫై చేయడంలో విజయానంద్ కీలకపాత్ర పోషించారు.

ఈ విధానం ద్వారా రాష్ట్రాన్ని 160 గిగా వాట్లకు పైగా జోడించడం ద్వారా గ్లోబల్ క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చ డం లక్ష్యంగా పెట్టుకుంది. పున రుత్పాదక శక్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రతిష్టాత్మక విధానం సుమా రుగా రూ. 10,00,000 కోట్లు పెట్టుబడులను రాబట్టడం తో పాటు ప్రత్యక్షంగా మరియు పరో క్షంగా దాదాపు 750,000 ఉద్యో గాలను సృష్టిస్తుంది.సౌర, పవన, హైబ్రిడ్ వనరులు మరియు గ్రీన్ హైడ్రోజన్‌పై దృష్టి సారించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ స్వీయ-ఆర్థిక స్వావలంబన సాధించడానికి మరియు భారతదేశ పునరు త్పా దక ఇంధన లక్ష్యాలకు గణనీయం గా దోహదపడుతుంది.విద్యుత్ రంగంలో విజయానంద్ యొక్క నైపుణ్యం దాదాపు 14 సంవత్స రాలుగా విస్తరించి ఉంది.ఇది వినూత్న నాయకత్వం మరియు వ్యూహాత్మక ప్రణాళికతో ఉంటుం ది.ఆయన నేతృత్వంలో ఆంధ్రప్ర దేశ్ యొక్క ఇంధన మౌలిక సదు పాయాలు మరియు సామర్థ్యా లను గణనీయంగా పెంచారు.

అంతకు ముందు సిఎస్ గా పదవీ విరమణ చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న కె.విజయానంద్ కు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.అదే విధంగా నూతన సిఎస్ విజయానంద్ సిఎస్ గా పదవీ విరమణ చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ కు పుష్ప గుచ్చం అందించి శుభా కాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి.సాయి ప్రసాద్,యం.టి.కృష్ణబాబు, టిటిడి ఇఓ శ్యామల రావు,జిఏడి కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్,ముఖ్య కార్యదర్శులు కాంతిలాల్ దండే,జయలక్ష్మి,కుమార్ విశ్వజిత్,పలువురు కార్యదర్శులు,పలువురు శాఖాధిపతులు,సచివాలయ అధికారులు,ఉద్యోగులు,వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సిఎస్ కు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.