Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fire Accident: ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో ఉదయం భారీ పేలుడు, ఒకరి మృతి

Fire Accident: ప్రజా దీవెన, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగి రిగుట్ట మండలం పెద్దకందుకూరు శివారులో ఉన్న ప్రీమియర్ ఎక్స్ ప్లో జివ్స్ కంపెనీలో ఉదయం భారీ పే లుడు సంభవించింది.ఈ బ్లాస్ట్ లో జనగాం జిల్లా బచ్చన్నపేట గ్రామా నికి చెందిన మార్క కనకయ్య (54) మృతి చెందగా యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్ పరిస్థి తి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన అతనిని మెరుగైన చికి త్స కోసం హుటాహుటిన హైదరా బాద్ కు, మరో ఇద్దరికి కార్మికులను మెరుగైన చికిత్స కోసం కిమ్స్ ఆసు పత్రులకు తరలించారు.

కంపెనీలో ఉదయం 9:45 గంటల ప్రాంతంలో పీఆర్డీసీ బిల్డింగ్-3 లో పెల్లెట్ ఫా ర్ములా తయారు చేస్తుండగా ప్రమా దవశాత్తు పేలుడు సంభవించిం ది.పేలుడు సమయంలో బిల్డింగ్ లో మొత్తం నలుగురు కార్మికులు పని చేస్తున్నారు.లంచ్ సమయం కావడంతో కార్మికులంతా బయట కు రాగా‌ నలుగురు మాత్రమే బిల్డిం గ్ లో ఉన్నారు. గ్యాస్ ఎనర్జీ కావ డంతో బ్లాస్ట్ సమయంలో భారీ సౌండ్ ఏర్పడింది. ప్రమాద స్థలికి వెళ్లడానికి సమయం పడుతుం దని, పూర్తి విచారణ అనంతరం ప్రమాదానికి గల కారణాలు వెల్ల డిస్తామని పరిశ్రమ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ వెల్లడించారు. బ్లాస్టింగ్ ఘటన యాదగిరిగుట్ట మండలం లోని సుమారు ఎనిమిది కిలో మీటర్ల వరకు పరిశ్రమ చుట్టూరా భారీ శబ్దం వినపడినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సం దర్శించి పరిస్థితిని పరిశీలించారు.

యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని, యా జమాన్యానికి కేవలం ధనార్జనే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తుందని, కానీ కార్మికుల సేఫ్టీని విస్మరించిం దని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై సంబంధిత శాఖ మంత్రి తో మాట్లాడినట్లు గతంలో కూడా ఈ సేఫ్టీ పై హెచ్చరించినట్లు చెప్పా రు. పరిశ్రమలో కనీసం ఒక అంబు లెన్స్ లేకపోవడం బాధాకరమ న్నా రు. కార్మికుల ప్రాణాలతో పరిశ్రమ చెలగాటమాడుతోందని విమర్శిం చారు.ఖచ్చితంగా ఈ ఘటనపై పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అన్నారు.మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మా ట్లాడుతూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమ ని,మృతి చెందిన కార్మికుడి కు టుంబాన్ని చికిత్స పొందుతున్న కార్మికుల కుటుంబాలను పరిశ్రమ ఆదుకోవాలని కోరారు.