Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Madhusudhan Reddy :రైతులను నట్టేట ముంచిన రాష్ట్ర ప్రభుత్వం

*గోలి మధుసూదన్ రెడ్డి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు*..
Madhusudhan Reddy: ప్రజా దీవెన, నల్గొండ టౌన్: గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు నెరవేర్చకుండా కొర్రీలు, కోతలు పెడుతూ రైతులను నట్టేట ముంచుతుంది అని రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు..

బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.ఆరు గ్యారెంటీల పథకాలను అమలు చేస్తామని రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి రైతులలో లేనిపోని ఆశలు కల్పించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాది గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు..

అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఏడాది గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి అనేక కారణాలు చూపిస్తూ కేవలం 30 శాతం మంది రైతులకు రుణమాఫీ చేసి 70% మంది రైతులకు ఎగనామం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఎద్దేవా చేశారు.

రైతు భరోసా కింద ఎకరాకు సంవత్సరానికి 15000 రూపాయలు ఇస్తామని చెప్పి ఖరీఫ్ సీజన్లో 7500 రబీ సీజన్లో 7500 ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు రైతులకు పంట సాయం కింద ఒక్క రూపాయి కూడా అందజేయకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు..

సంక్రాంతి పండుగ లోపల పెట్టుబడి సాయం అందిస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చి జనవరి 26 వరకు పొడిగించడం ఏంటని ప్రశ్నించారు అదేవిధంగా 15000 రూపాయలు ఇస్తామని చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 12,000 కి కుదించటం సిగ్గుచేటని మధుసూదన్ రెడ్డి విమర్శించారు..

రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేయూత అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా చేయూతనందించిన దాఖలాలు లేవని తెలిపారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నేటికీ అందజేయలేదని గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతుంటే కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు మునిగిపోయిందని సేవ చేశారు ప్రభుత్వం సరైన వసతులు కల్పించకపోవడంతో అనేక మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తూ చనిపోయిన ప్రతి విద్యార్థికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం యొక్క విధివిధానాలపై ప్రజలు తీవ్రమైన ఆవేశంతో ఉన్నారని రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కర్రు కాల్చి వాతలు పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్, నల్గొండ పట్టణ కన్వీనర్ మిర్యాల వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ రెడ్డి, బిజెపి నాయకులు బాకి నరసింహ,కందుకూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.