Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Allam Narayana: జర్నలిస్టుల సమస్యలపై సమరశీల పోరాటాలు

— టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షు లు అల్లం నారాయణ

Allam Narayana: ప్రజా దీవెన, గజ్వేల్ : జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని సమరశీల పోరాటాలు కొనసాగిస్తామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారా యణ అన్నారు. పర్కింగ్ జర్న లిస్టుల మీడియా అక్రిడేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరం తరం పోరాడుతామని స్పష్టం చేశా రు. ఆదివారం గజ్వేల్ పట్టణంలో ఓ ప్రవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పా టు చేసిన సభ్యత్వ నమోదు కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభు త్వ హయాంలో జర్నలిస్టుల ఆరో గ్యం కొరకు రూ.42 కోట్ల సీఎంఅ ర్ఎఫ్ నిధులను కేటా యించడం జరిగిందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో రూ. కోటి ఉన్న బడ్జెట్ ను వంద కోట్లకు తీసుకువెళ్ళిన ఘనత నాటి ప్రభుత్వానిదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మంది జర్నలి స్థులకు శిక్షణ శిబిరాలతో వృత్తి నైపుణ్యాన్ని పెంచడం జరిగింద న్నారు. కరోనా కష్ట కాలంలో 450 మంది జర్నలిస్టులకు 20 వేల చొప్పున వైద్య ఖర్చుల నిమి త్తం ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేలు ఉన్న అక్రెడిటేషన్ కార్డులను 23 వేలకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రె డిటేషన్ కార్డులను ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలం గాణనే అని అల్లం నారా యణ అన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ మాట్లాడుతూ సంస్థను నిర్మాణాత్మ కంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో జర్నలిస్టుల వ్యతిరేక చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడితే పోరాటం కోసం సిద్ధమవ్వాలని పిలుపుని చ్చారు.

అనంతరం గజ్వేల్ నియోజకవర్గ టీయూడ బ్లూజే కార్యవర్గాన్ని ఎన్నుకు న్నారు. అధ్యక్షునిగా గరిదాస్ నవీన్ కుమార్, ప్రధాన కార్య దర్శిగా మహిపాల్ రెడ్డి, ఉపా ధ్యక్షులుగా బాలరాజ్, కోశాధి కారిగా రమేష్ లు ఎన్నిక కాగా, టెంజూ అధ్యక్షునిగా మీర్జా అహ్మద్ బేగ్, కార్యదర్శిగా సాయిబాబాలు ఎన్నిక య్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీయూడ బ్ల్యూజే ఉపాధ్యక్షులు హజారే, రాష్ట్ర కోశా ధికారి యోగి, ఎంజేయు అధ్యక్షు లు విష్ణువర్ధన్ రెడ్డి జనరల్ సెక్రెటరీ రమణ, జర్నలిస్టులు పాల్గొన్నారు.