Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Burri Srinivasa Reddy: అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడి మహోత్సవం

Burri Srinivasa Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం ఇరుముడి మహో త్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 41 రోజు దీక్షలు చేసిన అయ్యప్ప స్వాములు శబరిమల వెళ్ళేందుకు ముందు అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ఇరుముడి కట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్ లు బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, కేసాని వేణుగోపాల్ రెడ్డి, పాల్గొని అయ్యప్ప స్వాములకు దండలు వేసి కానుకలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో గురు స్వాములు శ్యామ్, కొలనుపాక రవికుమార్, కంజర శీను, బుర్రి కార్తీక్ రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి, బండా శ్రీకాంత్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, జగిని వెంకన్న, వెంకట్ రెడ్డి,మురళి తదితరులు పాల్గొన్నారు.