MGU University: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, జాతీయ పరీక్షా కేంద్రం భారత్ సంయుక్త ఆధ్వర్యం లో నిర్వహించిన ఆరు రోజుల తెలుగులో పరీక్ష మూల్యాంకనం, ప్రశ్నాంశ పద్ధతి శిక్షణ శిబిరం ఆఫ్ లైన్ లో మూడు రోజుల కార్యక్ర మం విజయవంతంగా పూర్తిoది. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని తెలు గు ఉపాధ్యాయులు, వివిధ డిగ్రీ కళాశాలల తెలుగు అధ్యాపకులు పాల్గొనడం జరిగింది. ఇందులో వివిధ పరీక్షలలో విద్యార్థుల సామ ర్థ్యాలను పరీక్షించడం కోసం ఎలాం టి ప్రశ్నాపత్రం రూపొందించాలి. విద్యార్థుల మేధో శక్తిని ఎలా గుర్తిం చాలి, వారి స్థాయిని నిర్ణయించే పద్ధతి లాంటి పలు అంశాలపై నిపు ణులు ఈ మూడు రోజులు అధ్యా పకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా అధ్యాపకు లు మూల్యాంకనంలో మేలుకొలను నేర్చుకోవడం జరిగింది.
మిగతా మూడు రోజులు ఆన్లైన్లో శిక్షణ శిబి రంలో నేర్చుకున్న అంశాలపై ప్రశ్నల ను తయారు చేయాల్సి ఉంటుంది. దీని విద్యార్థుల స్థాయిని ప్రకారం వారి సామర్థ్యాలు నిర్ణయించడం విద్యార్థుల భాషా పరిజ్ఞానం, సాహి త్య పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం, అభ్యాసన పరిజ్ఞానం మొదలైన అంశాలు అంచనా వేయడంలో అధ్యాపకులు తర్ఫీదు తీసుకోవ డం జరిగింది. బుధవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ ప్రియ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఇప్పుడిప్పుడే అంచలంచలుగా అభివృద్ధి చెందుతూ రాష్ట్ర మరియు జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జాతీయ పరీక్షా సేవ కేంద్రం భారత్ ప్రతినిధులు డాక్టర్ ఎం నారాయణరెడ్డి, డాక్టర్ కొల్లేటి రఘుబాబు, మహాదేవ్, తెలుగు అధ్యాపకులు డాక్టర్ మ్యాతరి ఆనంద్, డాక్టర్ మద్దిరాల సత్యనారాయణ రెడ్డి, శ్రీమతి అనితకుమారి, గంగాధర నరసింహ, రామన్నపేట తెలుగు అధ్యాపకులు డాక్టర్ కృష్ణ కౌండిన్య, చేకూరి సతీష్ కుమార్, వివిధ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపకులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.