Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

S. Upender : ఎన్ జి కళాశాల జాబ్ మేళాలో 13 మంది ఎంపిక

S. Upender : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నాగార్జున ప్రభుత్వ కళాశాలలో టాస్క్ ద్వారా పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా నందు 102 విద్యార్థులు పాల్గొనగా అందులో ఆరుగురు విద్యార్థులు ఉద్యోగానికి అర్హత పొందారు అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఉపేందర్ మరియు టిఎస్కేసి సమన్వయకర్త డాక్టర్ ఎం.అనిల్ కుమార్ తెలిపారు.

ఇట్టి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నల్గొండలోని స్థానికంగా ఉన్న పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 2.50 ప్యాకేజీ ప్యాకేజ్ తో చేరాలి అని హెచ్ఆర్ మేనేజర్ దినేష్ తెలిపారు. ఇటీవల జరిగిన ఎమ్మెస్ ఎన్ లేబరా్టోరీస్ లో ఉద్యోగం సంపాదించిన ఏడుగురు విద్యార్థులను మరియు ఈ ఆరుగురు విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్, టీఎస్ కెసి సమన్వయకర్త, అధ్యాపకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో టాస్క్ క్లస్టర్ మేనేజర్ సుధీర్, తౌసిఫ్ మరియు పిరమల్ సిబ్బంది పాల్గొన్నారు