Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mukkoti Ekadhasi: శాలిగౌరారంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

Mukkoti Ekadhasi: ప్రజాదీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం లోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వెళ్లి భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. ఆలయంలో లోని ఉత్సవ విగ్రహాలను శాలిగౌరారంలోని పుర వీధుల్లో ఊరేగించారు. భక్తులు ఇంటింటా హరతులు ఇచ్చారు.

శాలిగౌరారం గ్రామానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ గురిజాల వెంకటేశ్వర్లు-రమాదేవి దంపతులు లక్ష రూపాయల వ్యయంతో పల్లకిని చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు శేషం రత్నమా చార్యులు, శేషం జగన్ మొహనా చార్యులు, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా యాత్ కాంగ్రెస్ ఉపాదక్షులు వడ్లకొండ పరమేష్ గౌడ్ దంపతులు, మాజీ ఎంపీటీసి దంపతులు జోగు సైదమ్మ-శ్రీనివాస్, శ్రీమన్నానారాయణ స్వామి మాలదరులు, భక్తులు పాల్గొన్నారు.