Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Part time Lecturers: వి.సి ని కలిసిన పార్ట్ టైం అధ్యాపకులు

Part time Lecturers: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలోని పార్ట్ టైం ఫ్యాకల్టీ అసోసియేషన్ వి.సి ప్రొ. ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తమను కాంట్రాక్ట్ అధ్యాపకులుగా అప్గ్రేడేషన్ చేయాలని కోరారు.

ఈ సందర్భంగా పార్ట్ టైం అసోసియేషన్ అధ్యక్షుడు డా. మద్దిరాల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. పార్ట్ టైం అధ్యాపకులు 6 నెలల జీతంతో అర్ధాకలితో బతుకుతున్నారని, వీలైనంత త్వరగా తమని అప్గ్రేడేషన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా.షరీఫ్, డా.ఆనంద్, డా. సైదులు, డా. రామకృష్ణ, డా.శ్రీనివాస్, డా.సుధాకర్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.