–అభినందించిన వీసీ ఆచార్య జి ఎన్ శ్రీనివాస్
GN Srinivas: ప్రజా దీవెన పాలమూరు: పాలమూరు యూనివర్సిటీలో ఫార్మసీ కళాశాల లో దశాబ్దకా లానికి పైగా అధ్యాపకునిగా పనిచేస్తున్న కోమటి సోమేశ్వర్ బీజు పట్నాయక్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎం ఈ.బానోజీ రావు పర్యవేక్షణలో ఫార్ములేషన్ డెవలప్మెంట్, ఆప్టిమైజేషన్ అండ్ క్యారెక్టరిజషన్ ఆఫ్ గ్యాస్ట్రో -రిటేంటివ్ డ్రగ్ డెలివరీ సిస్టం ఆఫ్ సెలెక్టెడ్ డ్రగ్స్ (తయారు చేసిన మైక్రో బేలూన్స్ -డ్రగ్ సరఫరా లో సమర్థవంతంగా పనిచేస్తాయి) అనే అంశం పై పీహెచ్డీ పూర్తి చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వీసీ ఆచార్య శ్రీని వాస్ మాట్లాడుతూ నూతన టెక్నాలజీ (క్వాలిటీ బై డిజైన్ )ని ఉపయోగించుకొని తయారు చేసి న మైక్రో బాలూన్స్ వైద్య రంగంలో ముఖ్య భూమిక వహిస్తాయని, గ్యాస్ట్రో సంబంధిత, సైకోలాజికల్ సంబంధిత, ఆత్మనూన్యత, బీపీ ల నియంత్రణ లో వాడే మందుల సరఫరా లో సమర్థవంతంగా డ్రగ్ డెలివరీ కి దోహదపడతాయని, ఫార్మసీ లో పీహెచ్డీ చేసిన వారికీ దేశ విదేశాలలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు.
కుటుంబ నేపథ్యం… చేనేత కుటుంబంలో జన్మించిన సోమేశ్వ ర్ కోమటి తల్లిదండ్రులు వెల్కమ్ టైలర్ యాదగిరి, అరుణ, భార్య విశాలి, కూతుర్లు రియాన్సిక, హన్విక అన్నలు సంతోష్ కుమార్, అవినాష్ బాబు కాగా ఈయన స్వస్థలము నల్గొండ. విద్యాభ్యాసం …సోమేశ్వర్ 1 నుంచి 10వ తరగతి వరకు నల్గొండ లో చదివారు. ఉపాధ్యా యుల ప్రోత్సాహంతో 12వ తరగ తి వరకు హైదరాబాద్ లో చదివా రు. బి ఫార్మసీ నలంద ఫార్మసీ కాలే జీ లో పూర్తి చేశారు.ఎం ఫార్మ సీ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కె ఎల్ ఆర్ కాలేజీ లో పూర్తి చేశా రు. అదే విధంగా బీజు పట్నాయక్ యూనివర్సిటీ, ఒడిస్సా లో పిహెచ్డి పూర్తి చేశారు.అంతర్జాతీయ కాన్ఫ రెన్స్ లో బెస్ట్ పోస్టర్ అవార్డు సా ధించారు.ఈయన చేసిన పరిశోధ నా పత్రాలు పలు జాతీయ అంత ర్జాతీయ జర్నల్స్ లో ప్రచురిత మయ్యాయి.
అదనపు బాధ్యతలు జాతీయ సేవ పథకం ప్రోగ్రాం అధికారిగా, న్యూ పీజీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ గా సేవలందించారు.ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, విభాగాధిపతి డా ప్రభాకర్ రెడ్డి, డా రవికాంత్, డా శిలాస్, డా ఈశ్వర్ కుమార్, డా రవి కుమార్, డా శ్రీధర్ రెడ్డి, డా సుదర్శన్ రెడ్డి, డా పర్వతాలు,డా వెంకటేష్, స్వాతి, రామ్మోహన్, సురేష్,తదితరులు సోమేశ్వర్ ని అభినందించారు.