Vantipulivenkatesh : ప్రజా దీవెన,కోదాడ:వడ్డెర సంఘం నియోజక వర్గ అధ్యక్షుడు చింతల నాగేశ్వర రావు అధ్యక్షత న వడ్డెర ఓబన్న 218 వ జయంతి వేడుకలను పట్టణంలో బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వంటిపులివెంకటేష్ పాల్గొని ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ,వడ్డెర ఓబన్న 1807జనవరి 11 న నంద్యాల జిల్లా, సంజామల మండలం నోస్సం గ్రామంలో జన్మించారని. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దురాగతాలను ఎదురొడ్డి నిలిచిన వీరుడు వడ్డెర ఓబన్న అని గుర్తు చేశారు ఆనాటి రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కి కుడి భుజంగా, సర్వ సైన్యాధ్యక్షుడుగా 9000 మంది సైనికులను ముందుండి నడిపిన గెరిల్లా యుద్ద వీరుడు వడ్డెర ఒబన్న అని ఆడారు కొనియాడారు కొనియాడారు 1846జూలై లో.
నంద్యాల జిల్లా కోవెల కుంట్ల సబ్ ట్రెజరీ పై తన సైన్యంతో దాడిచేసి, కొల్లగొట్టిన ధనాన్ని పేద రైతులకు పంచిన మానవతా వాది వడ్డెర ఒబన్న అని తెలిపారు వడ్డెర ఒబన్న జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు వడ్డెర కులానికి చెందిన వ్యక్తిని MBC కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం వడ్డెర జాతికి గర్వకారణం అని తెలిపారు ఈ కార్యక్రమంలో వంటిపులి గోపయ్య, చింతల లింగయ్య, వేముల వెంకయ్య వంటిపులి శ్రీను, బత్తుల ఉపేందర్, ఉప్పతల శ్రీనివాస్, ఓర్సు దుర్గారావు, బండ్ల దాసు ఉప్పతల కోటేశ్వర రావు, వేముల బాలయ్య , దేవరంగుల శ్రీను, చల్లా సూర్యం, వేముల రాము, వల్లెపు వీరయ్య, ఉప్పతల చిన్న లింగయ్య, గుంజి సైదులు, చింతల రమేష్, పందిబోటు దుర్గారావు, రమేశ్ మరియు వడ్డెర కులపెద్దలు పాల్గోన్నారు.