Bolli Konda Kotaiya : ప్రజా దీవెన,కోదాడ:స్థానిక పట్టణంలోని స్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చ్ లో సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య ఆధ్వర్యంలో నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అనంతరం పాస్టర్ యేసయ్య మాట్లాడుతూ. ఈ డైరీ ద్వారా క్రైస్తవులు వారి దిన చర్యలు తో పాటు దేవుని సన్నిధికి దగ్గరగా జీవించటానికి ఈ డైరీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ క్రిస్టియన్ మైనార్టీ కోఆప్షన్ నెంబర్ వంటపాక జానకి ఏసయ్య, సంఘ సభ్యులు బొల్లి కొండ కోటయ్య, జగ్గు నాయక్ విజయానంద్ మోజెస్ రాంబాబు స్టీఫెన్, మెరీనా రాణి మేరమ్మ ద్రాక్షావల్లి తబిత సీత సుధా,రమ్యశ్రీ మేరా బి యేసు తదితరులు పాల్గొన్నారు