Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC Kavitha: కాంగ్రెస్ డీఎన్ఏ విద్వేషం, విద్రో హo,హింస‌ను ప్రేరేపించే దుకాణం

–రాజ‌కీయంగా ఎదుర్కోలేక దాడు లు
–రాహుల్ గాంధీ వ‌ల్లించే మొహ బ్బత్ కి దుకాన్ ఒట్టి బూటకం
–కాంగ్రెస్ యువ‌జ‌న విభాగం గూం డాల విభాగంగా మారింది
— కాంగ్రెస్ విష సంస్కృతికి ఇదే పెద్ద నిద‌ర్శ‌నం
–భౌతిక దాడుల‌తో గులాబీ సైని కుల‌ను భ‌య‌పెట్ట‌లేరు
— బీఆర్ఎస్ జిల్లా కార్యాల‌యంపై దాడిని ఖండించిన ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha: ప్రజా దీవెన, హైద‌రాబాద్ : యాదా ద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ గూండాలు చేసిన‌ దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్రంగా ఖండి స్తున్నాను. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ లోనే ద్వేషం, హింస‌, విధ్వంసం ఉంద‌ని మండిప‌డ్డారు. ముఖ్య‌ మంత్రి ప్రోద్భ‌లంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతు న్నార‌ని విరుచుకుప‌డ్డారు. బీఆ ర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదు ర్కోలేక కాంగ్రెస్ నాయకులు ఇలాం టి హింసాత్మక చర్యలకు పాల్పడ డం దుర్మార్గమ‌ని స్ప‌ష్టం చేశారు.

భౌతిక దాడులతో గులాబీ సైనికు లను భయపెట్టలేరని తేల్చిచె ప్పారు. ఈ దాడిని పిరికిపంద చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు.రాహుల్ గాంధీ వ‌ల్లించే మొహబ్బత్ కి దుకాన్ ఒక బూటకమ‌ని తేట‌తెల్ల‌మైందని, అది విద్వేషం, హింసను ప్రేరేపించే దుకాణమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇలాంటి హింసా రాజ‌కీయాల‌ను తెలంగాణ తిర‌స్క‌రిస్తుందని, హింస‌కు, విద్వంస‌క‌ర చ‌ర్య‌ల‌కు తెలంగాణలో తావు లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ త‌న‌ యువ‌జ‌న విభాగాన్ని గూండాల‌ విభాగంగా తీర్చిదిద్దుతోందని మండిప‌డ్డారు. యాదాద్రి భువనగిరిలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంపై ఎన్‌ఎస్‌యూఐ, యువ‌జ‌న కాంగ్రెస్‌ జరిపిన దాడి వారి అసలు రంగును బట్టబయలు చేసిందని, కాంగ్రెస్ విష సంస్కృతికి ఇదొక నిద‌ర్శ‌నమ‌ని చెప్పారు. ఇలాంటి సిగ్గుమాలిన కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు బుద్దిచెబుతార‌ని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల జోలికి వ‌స్తే ఊరుకోబోమ‌ని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ మూకలపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వెంట‌నే అరెస్టు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.