Nagam Varshit Reddy :దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద .* నాగం వర్షిత్ రెడ్డి
Nagam Varshit Reddy : ప్రజా దీవెన, నల్గొండ: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని వివేకానంద విగ్రహనికి బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్శిత్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. సందర్భంగా నాగం వర్శిత్ రెడ్డి మాట్లాడుతూ. భారతదేశ ఔన్నత్యాన్ని స్వామి వివేకానంద ప్రపంచమంతా చాటి చెప్పారని నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు.
స్వామి వివేకానంద జయంతి పర్వదినాన్ని భారతీయులు జాతీయ యువజన దినోత్సవం గా జరుపుకోవడం సంతోషమని వ్యక్తం చేశారు.. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు అని వేదాంత, యోగ తత్త్వ శాస్త్రాలకు సంబంధించి సమాజంలో అత్యంత ప్రభావాన్ని కలిగించిన ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త వివేకానందుడు అని తెలుపుతూ,ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్పూర్తిమంత్రాలు అని అవి ఇప్పటికీ యువతలో చైతన్యాన్ని నింపుతున్నాయి అని వర్షిత్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజు, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి ,పక్కిరు మోహన్ రెడ్డి, మిరియాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..