Sankranti Festival : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సమాజ మార్పు కోసం మహిళలు పోరాటాల్లోకి రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హాశం అన్నారు.
సోమవారం 11వ వార్డు కతాల గూడెం కమ్యూనిటీ హాల్ దగ్గర మామిళ్ళగూడెం మాజీ సర్పంచ్ పనస కాశమ్మ -సత్తయ్యల జ్ఞాపకార్థం సిపిఎం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన హాశం మాట్లాడుతూ మహిళలు ఒకప్పుడు వంటింటికే పరిమితమైన వారు నేడు అనేక రంగాలలో ముందు బాగానే ఉంటున్నారని అన్నారు. సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రతి మహిళ ప్రశ్నించిన రోజునే సమాజం పురోగతికి చెందుతుందని అన్నారు. అదేవిధంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి సమాజంలో మహిళలు ఎందులో తక్కువ కాదని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు .చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించినప్పుడే మహిళలకు సరైన గౌరవం దక్కుతుందన్నారు. పాలక ప్రభుత్వాలు ఈ రకమైన నిర్ణయాలు చేయాలని వారు డిమాండ్ చేశారు .ఈ ముగ్గుల పోటీ ద్వారా మహిళల్లో ఉన్న సృజనాత్మకత వెలికితీయడానికి ఉపయోగపడుతుందని వారు అన్నారు. ఇండ్లు లేని పేదలు అనేకమంది ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి 120 గజాల చొప్పున ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీలు కచ్చితంగా అమలు జరపాలని లేనియెడల సిపిఎం పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు
ఈ ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి దూదిమెట్ల కళ్యాణి ,రెండవ బహుమతి రేవల్లి కావేరి, మూడవ బహుమతి ముడిగా ఆరాధ్య లు పొందారు. సిపిఎం 11వ వార్డు శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం , పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, దండెంపల్లి సరోజ, ఉట్కూరు మధుసూదన్ రెడ్డి, గుండాల నరేష్, భూతం అరుణకుమారి, పనస యాదగిరి పనస దేవేందర్ , శాఖ సభ్యులు దండంపల్లి యాదయ్య మారయ్య పామనగుండ్ల రాజు, దండంపల్లి లక్ష్మణ్, పాలకూరి శ్రావణ్ కుమార్, వడ్డే ధనమ్మ పామనగుండ్ల కలమ్మ, అంగన్వాడీ టీచర్ రమాదేవి ఆర్ పి మమత అవురేండ్ల కాశయ్య తదితరులు పాల్గొన్నారు