ACB : ప్రజా దీవెన, మెట్ పల్లి:
మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యా లయంపై ఏ సి బి దాడులు నిర్వ హించింది. రూ 5000 లంచం తీసు కుంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మా పూర్ గ్రామానికి చెందిన సుంకె విష్ణు తన భూమి మార్ట్ గేజ్ కోసం ఇటీవల సబ్ రిజిస్ట్రార్ అసీఫొద్దీన్ ను సంప్రదించాడు.
భూమి మార్ట్ గేజ్ చేసేందుకు 10 వేల రూపా యలు ఇవ్వాలని రవి డిమాండ్ చేయగా చివరకు రూ. 5000 ఇ చ్చేందుకు అంగీకారం కుదిరింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవికి 5000 రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని సబ్ రిజిస్టార్ అసీఫోద్దీన్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి రవి తో డాక్యుమెంట్ రైటర్ రవి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు