Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TTD : కమనీయంగా కన్నుల పండువగా గోదా కల్యాణం

TTD : ప్రజా దీవెన, తిరుపతి: టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో బుధవారం రాత్రి కన్నుల పండువగా గోదా కల్యాణం జరిగింది.ముందుగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూ ర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు. ఎస్వీ సంగీ త నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆ ద్యంతంగా అలరించింది. అన్నమా చార్య ప్రాజెక్టు కళాకారులు అన్న మాచార్య సంకీర్తనలను సుమధు రంగా ఆలపించింది. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకు లు శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యా హవాచనం, అంకురార్పణం, రక్షా బంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారు సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేద నం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు.

 

ఆతరువా త మహా సంకల్పం, స్వామి, అమ్మ వార్ల ప్రవరలు, మాంగల్యపూజ, మాంగల్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన హోమము, లాజ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరి పారు. వారణమాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరగా నివేదన, మంగళ హార తు లు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్య క్రమం ముగిసింది.టిటిడి బోర్డు స భ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, జేఈ వో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, తిరు మల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చ కులు శ్రీ వేణుగోపాల్ దీక్షితులు, ఎస్వీ సంగీతనృత్య కళాశాల ప్రిన్సి పాల్ శ్రీమతి ఉమా ముద్దుబాల తదితరులు పాల్గొన్నారు.