ఆఎన్నికల్లో పాల్గొంటే అంతే సంగతులు, అవి ఏ ఎన్నికలో తెలుసా
Mlcelections: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో జరుగ నున్న ఎన్నికలపై ఎల క్షన్ కమిషన్ దృష్టి సారించింది. ప్రస్తుతం రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎ న్నికలు జరగ నుండటంతో చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఇది నిబంధనలకు విరుద్దమని అధికారులు చెప్తున్నా రు.
ప్రచారంలో పాల్గొన్న టీచర్లు, సర్కారు ఉద్యోగులపై వేటు తప్పద ని హెచ్చరిస్తున్నారు. మార్చిలో రెం డు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎ న్నికలు జరగనున్నాయి. ఈ నేప థ్యంలో దానికి సంబంధించిన ఏ ర్పాట్లపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంపైనా నిఘా పెట్టింది. అ యితే, బడుల్లో ప్రచారం చేయొద్దని ఇప్పటికే ఆయా సెగ్మెంట్ల ఎన్ని కల రిటర్నింగ్ ఆఫీసర్లు ఉత్తర్వులు జారీచేశారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి అయి నా తమ ఆఫీసుల్లో, లేదా ఇంటిం టి ఎన్నికల ప్రచారంలో పాల్గొన వద్దు. స్కూ ళ్లలో, సర్కారు ఆఫీసు ల్లో అభ్యర్థులు ప్రచారం చేయొద్దు. కేవలం అభ్యర్థులు, ఉద్యోగులుకా ని వాళ్లు మాత్రమే ఇంటింటి ప్రచారం చే సుకునే అవకాశం ఉంది. కానీ, పలువురు టీచర్లు, సంఘాల నేత లు ప్రచారంలో పాల్గొంటున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు లు వస్తున్నాయి.
తాజాగా ఎమ్మె ల్సీ ఎన్నికల అభ్యర్థిగా ఉన్న ఓ టీచర్ సంఘం నేత పై కొందరు ఎన్ని కల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో ఏకంగా ఆ లీడర్ తన ఉద్యో గానికి రాజీనామాచేశారు. చాలా మంది టీచర్లు ఇంటింటి ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో కొందరు టీచర్లు అభ్యర్థులకు మద్ద తుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఎవరెవరు ప్రచారంలో పాల్గొం టున్నారనే వివ రాల సేకరణకు ప్రత్యేకంగా టీముల ను ఏర్పాటు చేసే అవకాశాలు న్నా యి. దీనికి ఈసీ చర్యలు చేపడుతున్నట్టు తెలిసింది.