CPIM : ప్రజా దీవెన, నాంపల్లి: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈనెల 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న క్రమంలో 25న గొప్ప బహిరంగ సభ జరుగుతున్నoదున అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాల డుగు నాగార్జున పిలుపునిచ్చారు. శనివారం నాంపల్లి మండల కేంద్రం లో సిపిఎం రాష్ట్ర మహాసభల పోస్ట ర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడు తూ సిపిఎం ప్రజా సమస్యల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుం దని తెలిపారు రాష్ట్రంలో ప్రాజెక్టు ల సమస్యలు భూమిలేని నిరుపే దల సమస్యలు కార్మిక హక్కులు కార్మిక చట్టాలు రక్షణకై ఉద్యమా లు కొనసాగిస్తుందన్నారు. సిపిఐ ఎం జాతీయ గుర్తింపు కలిగిన పార్టీ నిరంతరం పేదలు కార్మికులు ఉద్యో గులు కష్టజీవులు హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ ప్రజాస్వామ్యం లౌకిక విధానం సామాజిక న్యాయం కోసం అంకిత భావంతో ఉద్యమి స్తున్న పార్టీ సిపిఎం అని ఆయన అన్నారు.
ఈ మహాసభల్లో రాష్ట్రం లోని ఆర్థిక సామాజిక అంశాలు కార్మిక కర్షక పేదలు మహిళలు ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం గత పది సంవ త్సరాలుగా అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పారిశ్రామికరంగాన్ని వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించాయని విద్య వైద్యం సామాన్యులకు అంద ని ద్రాక్షలా మారిందని ఆయన అ న్నారు. ఈ రాష్ట్ర మహాసభల్లో అనేక ప్రజా సమస్యలపై చర్చించి దిశా నిర్దేశం చేయడం జరుగుతుం దని ఈ సభ జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కా ర్యక్రమంలో నాంపల్లి మండల సిపి ఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, లక్ష్మయ్య, వెంకట య్య, జైపాల్ రెడ్డి, యాదగిరి, సైదులు, గోపాల్, లక్ష్మయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.