Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy : పేద విద్యార్థులకు అండదండగా ఉంటా..

**ప్రతి విద్యార్థి చదువుల్లో ముందుండాలి..

**రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komati Reddy Venkata Reddy : ప్రజా దీవెన/ కనగల్: సమాజంలో ఉన్నత స్థానం సాధించేందుకు బాగా కష్టపడి చదివి పైకి రావాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు. సోమవారం అయన కనగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు .పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, చదువు ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ విద్యా భారతి పాఠశాలలో కొన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ముఖ్యంగా మరుగుదొడ్లకు ఇబ్బంది గా ఉందని, అలాగే వాటర్ ట్యాంక్ కావాలని కోరగా, తక్షణమే మంత్రి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో టాయిలెట్స్ తో పాటు, మినీ వాటర్ ట్యాంక్ ను చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలో సాయంత్రం సమయంలో కొంతమంది అల్లరి మూకలు పాఠశాలలో చొరబడుతున్నారని తెలుపగా, తక్షణమే వారిపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

 

అనంతరం మంత్రి కనగల్లు జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఆర్డీవో అశోక్ రెడ్డి , ఆర్ అండ్ బి డిప్యూటీ ఇంజనీర్ గణేష్, కనగల్ తహసిల్దార్ పద్మ, జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచి నర్సింగ్ సునీత కృష్ణయ్య గౌడ్ మాజీ కోఆప్షన్ నెంబర్ ఎండి హఫీజ్ ఉద్దీన్ నల్లగొండ మార్కెట్ కమిటీ సభ్యుడు ఎస్.కె కరిముల్లా, నక్క వెంకన్న, సింగం పెద్దలు, పాలకూరి వెంకటేశం, జినుకుంట్ల అంజయ్య, పాలకూరి పరుశరాములు, ఆవుల శంకర్ కొంపెల్లి శంకర్ ,రాయల శ్రవణ్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు