మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సాయం అందజేసిన రాపర్తి సురేష్ గౌడ్
Raparthi Suresh Goud : ప్రజా దీవన, నారాయణపురం : మృతుని కుటుంబానికి రాపర్తి సురేష్ గౌడ్ ఆర్థిక సహాయం సంస్థాన్ నారాయణపురం గ్రామానికి చెందిన వీరమల్ల యశోద మరణించిన విషయాన్ని తెలుసుకున్న విశాల హృదయంతో,మానవత దృక్పథంతో నిరుపేద కుటుంబానికి సహాయం చేయాలని గొప్ప మనసుతో 5000 రూపాయల సహాయాన్ని స్ఫూర్తి విద్యాసంస్థల చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ మృతురాలి కుటుంబానికి అందజేశారు.
మృతదేహానికి పూలమాలలు వేసి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో రాసాల వెంకటేశం,ఉప్పల ఆంజనేయులు,రాపర్తి కరుణాకర్,రాసాల విజయ్,వీరమల్ల జంగయ్య,వీరమల్ల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు