Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Matangi Das : డప్పుతో దరువేస్తూ… కదం తొక్కుదాం

లక్ష డప్పుల సౌండ్ తో పాలకుల గుండెల్లో రీసౌండ్ మోగాలి.
*మాదిగ జర్నలిస్ట్ లారా హైదరాబాదుకు వేలాదిగా తరలి రాండి: మాతంగి దాస్

Matangi Das : ప్రజా దీవెన, సూర్యాపేట :లక్ష డప్పులు చేసే సౌండ్ రిజర్వేషన్ కై మాట ఇచ్చి తప్పుతున్న పాలకుల గుండెల్లో రిసౌండ్ లు మోగాలని మాదిగ జర్నలిస్ట్ ఫోరం జాతీయ అధ్యక్షులు మాతంగి దాస్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక ఎమ్మెస్ కళాశాల ఆవరణలో వేల గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమాన్ని ఈ విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.

 

ఫిబ్రవరి 7 వ తేదీన హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై జరుగు వేల గొంతులు లక్ష డప్పులు కార్యక్రమ సభను విజయవంతం చేయడానికై కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున మాదిగ జర్నలిస్టులు తరలి రావాలని పిలుపు నిచ్చారు.మాదిగలతో కలిసి డప్పు కొట్టి మరీ చెప్తున్నా వర్గీకరణ అమలుకై జరిగే ప్రజాపోరుకు మా సంపూర్ణ మద్దతు తెలుపడం జరిగిందన్నారు.

 

మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకులు పాఠశాల రఘు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంల జాతీయ ఇంచార్జ్ లక్ష్మణ్,mwju రాష్ట్ర కన్వీనర్ అశోక్, ఎం జె ఎఫ్, రాష్ట్ర అధ్యక్షులు రమేష్, జాతీయ నాయకులు అశోక్, నల్గొండ అధ్యక్షులు రవీందర్, బంక వెంకటరత్నం, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, నియోజకవర్గ అధ్యక్షులు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, రవీందర్, బాబు, మహేష్, సునీల్ రత్నాకర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు