–మహబూబ్ నగర్ మన్యంకొండ జాతరపై సమీక్ష
–భక్తులకు ఏర్పాట్లలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలి
–మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్ రెడ్డి
Srinivas Reddy : ప్రజా దీవెన మహబూబ్ నగర్: మన్యం కొండ దేవస్థానం ప్రతిష్ట ను పెంచే విధంగా శ్రీ లక్ష్మీ వేంకటే శ్వర స్వామి జాతర ఏర్పాట్లు చే యాలని మహబూబ్ నగర్ ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికా రులను ఆదేశించారు. జిల్లా కలెక్ట ర్ కార్యాలయం లోని ఐడిఓసి లో మన్యం కొండ జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశానికి ఆయన ము ఖ్య అతిథిగా పాల్గొని అన్ని శాఖ ల జిల్లా అధికారులతో సమీక్ష స మావేశం నిర్వహించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 7 వ తేదీ నుంచి మార్చి 16 వరకు మన్యం కొండ జాతర జరుగుతుం దని, ఫిబ్రవరి 12 న రథోత్సవం జరుగుతుందని ఆయన తెలిపారు. రంగరంగ వైభవంగా మన్యం కొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతర నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామి జాతరకు వచ్చారని , అలాగే మన్యం కొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని వారికి సంకల్పం ఉంది కాబట్టి అధికార యంత్రాంగం అప్రమత్తతతో ఉండి ఏర్పాట్లు చే యాలని ఆయన సూచించారు. దేవాలయ అభివృద్ధి కోసం ముఖ్య మంత్రి రాష్ట్ర స్థాయి అధికారుల బృందాన్ని మన్యం కొండకు పం పించారని, దేవాలయ చైర్మన్ మరి యు ఎఓతో అధికారుల బృందం చర్చించారని ఆయన చెప్పారు . జిల్లా కలెక్టర్, లోకల్ బాడీస్ అదన పు కలెక్టర్, గ్రంథాలయ సంస్థ చైర్మ న్ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ విసిట్ చేస్తారని ఆయన తెలిపా రు. ఈ బ్రహ్మోత్సవాలకు జిల్లా నలు మూలల నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకొని వెళ్తారని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుం డా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జాతరకు వచ్చే మంత్రులు, విఐపి ముమెంట్ కు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధి కారులను ఆయన ఆదేశించారు.
గత సంవత్సరం ఏమైనా లోటు పాట్లు జరిగి ఉంటే వాటిని సరిచే సుకోవాలని , రవాణా, తాగునీటి సౌకర్యం, విద్యుత్, షెడ్లు తో పాటు భక్తులు స్నానాలు ఆచరిం చుటకు తగు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఆర్టీసి వారికి బస్సులు పెంచాలని కోరడం జరిగిందని, ఆర్టీసీ చైర్మన్ తో మాట్లాడడం జరుగుతుందని , పోలీసులు, ఆర్టీఓ సమన్వయంతో పనిచేయాలని, మహబూబ్ నగర్ మున్సిపల్ అధికారులు కూడా జాతర ఏర్పాట్లలో పాలు పంచు కోవాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా మన్యం కొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల గోడ పత్రికను ఆయన ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అద నపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ , జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాల య సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మా రెడ్డి, మన్యం కొండ దేవస్థానం ధర్మకర్త అలహరి మధుసూదన్, ఇఓ శ్రీనివాస్ రాజు, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయ కులు బుద్దారం సుధాకర్ రెడ్డి, బెజ్జుగం రాఘవేంధర్, సాదతుల్లా, శ్రీనివాస్ యాదవ్, ఆజ్మత్ ఆలి, జిల్లా అధికారులు, మన్యం కొండ దేవస్థానం పాలకమండలి సభ్యు లు తదితరులు పాల్గొన్నారు.