Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahatma Gandhi : సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ వర్ధంతి

Mahatma Gandhi : ప్రజాదీవెన, హైదరాబాద్ : హైదరాబాద్ లో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లోని వనస్థలిపురం లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్ మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్.చంటి ముదిరాజ్ మాట్లాడుతూ జాతిపితగా మహాత్మా గాంధీ చూపించిన అహింసా మార్గంలో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని అన్నారు.

 

 

దేశాభివృద్ధిలో మహాత్మా గాంధీ సూచనలను అనుసరిస్తూ యువత అడుగులు వేయాలని అన్నారు.సమాచార హక్కు చట్టం సాధన కమిటీ అన్నివేళలా ప్రజలకు సేవ చేసేందుకు ముందుంటుందని డాక్టర్.చంటి ముదిరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు జి.ప్రియా రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తుల మహేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అంతటి అజయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి దీపక్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు