ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి
Krishna Reddy : ప్రజా దీవెన నాంపల్లి ఫిబ్రవరి 3: నాంపల్లి మండలంలోని ఉప్పరిగూడెం గ్రామంలో వెలసిన శ్రీ బాలాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు వేద బ్రాహ్మణులచే యాగశాలలో ప్రత్యేకంగా హోమాలు గత నాలుగు రోజులుగా నిర్వహించి ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు స్వామివారి దేవాలయం ఎదురుగా ధ్వజస్తంభ కార్యక్రమం ఘనంగా గ్రామ ప్రజలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజలు వేలాదిగా పాల్గొని స్వామివారికి దర్శనం చేసుకుని మొక్కలు తీర్చుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి హాజరై ధ్వజస్తంభానికి బ్రాహ్మణుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు అనంతరం గ్రామస్థులని ఉద్దేశించి మాట్లాడుతూ దేవాలయ నిర్మాణానికి గతంలో సహకరించానని ప్రస్తుతం ఇకముందు కూడా తన వంతు సహకరిస్తానని అన్నారు గ్రామస్తులు సంతోషంతో అభినందనలు తెలియజేశారు పూజా కార్యక్రమంలో ప్రత్యేక దృష్టిని పెట్టిన నక్క చంద్రమౌళి దంపతులను శాలువాతో గ్రామ ప్రజలు సన్మానించారు .
ఈ కార్యక్రమంలో రామకోటి గీతా అధ్యక్షులు నక్క భువనేశ్వర్ శాస్త్రవేత్త నక్క లింగయ్య బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణాటి విద్యాసాగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏ రెడ్ల రఘుపతి రెడ్డి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య నాంపల్లి పట్టణ మాజీ వార్డ్ మెంబర్లు గుండెబోయిన సత్తయ్య కొండయ్య పరమేష్ యాదవ్ ఉడుత బిక్షమయ్య పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పానుగంటి వెంకటయ్య గీత భక్తులు నేర్లకంటి కేశవులు కామన్ బోయిన ఈశ్వరయ్య కామిశెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు