CM Revanth : ప్రజా దీవెన, హైదరాబాద్: మహిళ ల అండర్ -19 ప్రపంచ కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలి చి టీమ్ ఇండియా విజయం లో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిషకు ప్రోత్సాహకంగా ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోటి రూపా యల భారీ నజరానా ప్రకటించారు. మలేషియాలో జరిగిన మహిళ అండర్ -19 ప్రపంచ కప్లో అద్భు తంగా రాణించిన త్రిషను ముఖ్య మంత్రి అభినందించారు.
కుటుంబ సభ్యులతో కలిసి గొంగడి త్రిష జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్య మంత్రిని మర్యాద పూర్వకంగా కలి శారు. భవిష్యత్తులో భారతదేశం తరఫున మరింతగా రాణించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆ కాంక్షించారు. త్రిషకు కోటి రూపా యల బహుమతిని ప్రకటించిన ముఖ్యమంత్రి అలాగే, అండర్ -19 ప్రపంచ కప్ టీం సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి 10 లక్షల రూపాయలు, టీం హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్ కి, ట్రైనర్ షాలినికి 10 లక్షల చొప్పున బహు మతిని ప్రకటించారు.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన త్రిష కలి సిన సందర్భంగా మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సల హాదారు వేం నరేందర్ రెడ్డి, పలు వురు లోక్సభ సభ్యులు, ఎమ్మె ల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనా రె డ్డితో పాటు ఇతర ప్రముఖులు ఉ న్నారు.