Srisailam : ప్రజా దీవెన, శ్రీశైలం: శివయ్య సన్నిధిలో కార్మికుడు శివైక్యం పొం దారు. శ్రీశైలం శివ రాత్రి ఏర్పా ట్లలో అపశృతి దొర్లడంతో ఈ ప్ర మాదం చోటుచేసుకుంది. అధికా రులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యుత్ కార్మికుడు బలయ్యా డు. విద్యుత్ షాక్తో కరెంటు స్తం భంపైనే వేలాడుతూ ప్రాణాలు వది లాడు.నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పా ట్లు ముమ్మరంగా జరుగుతున్నా యి. ఈ క్రమంలో ఏపీ ట్రాన్స్ కో టెండర్ ప్రాతిపదికన చేపడుతోంది. విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల్లో భా గంగా తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా రామాపురం గ్రామానికి చెంది న కార్మికుడు కృష్ణ(28) స్తంభంపై కరెంట్ పని చేస్తున్నాడు. అకస్మా త్తుగా విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై, స్తంభంపై నే పడిపోయాడు. విషయం తెలు సుకున్న అధికారులు విద్యుత్ కార్మికుడిని కరెంట్ ఫోల్ మీద నుంచి కిందకు దించి దేవస్థానం వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే కార్మికుడు మరణించిన ట్లు వైద్య సిబ్బంది తెలిపింది.
విద్యుత్ కార్మికుడిని కాపాడేందుకు దేవస్థాన వైద్యశాల వైద్యులు అన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో విద్యుత్ కార్మికుడు మృతి చెందాడు. దేవ స్థానం అధికారులు విద్యుత్ శాఖ అధికారుల సమన్వయ లోపంతో కార్మికుడు మృతి చెందినట్లుగా స్థానికులు మండిపడుతున్నారు. కార్మికుడు విద్యుత్ పనులు చేసే టప్పుడు సప్లై ఉందా లేదా అని పరిశీలించి, సప్లై లేదని నిర్ధారించు కున్న తర్వాతనే పనులు చేయాలి. అయితే విద్యుత్ సప్లై లేనప్పుడు జనరేటర్ తో సప్లై అయినట్లు ప్రాథ మిక సమాచారం. ఏది ఏమైనా నిర్ల క్ష్యం కారణంగానే విద్యుత్ కార్మికు డు మృత్యువాత పడ్డాడు.