–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Tripati: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ సమీపంలోని రాముల బండ తం డా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రసవాలతోపాటు, పేద ప్రజలకు ఇంకా మంచి వైద్య సేవలు అందిం చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు.గురువారం ఆమె రాముల బండ తండా ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రిజి స్టర్లను, సౌకర్యాలను అన్నిటిని పరి శీలించారు.ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు మంచి వైద్య సేవలు అందిస్తున్నప్ప టికీ ప్రసవాల సంఖ్యను పెంచాలని, అలాగే వైద్య పరీక్షలు, ఓపిని పెం చాలని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాములబండ తండా పి హెచ్ సి లో స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ లేనందున ఇబ్బందిగా ఉందని ,స్టాఫ్ నర్సతో పాటు ల్యా బ్ టెక్నీషియన్ ను ఏర్పాటు చే యాలని కోరగా తక్షణమే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, తదితరులు ఉన్నారు.