–కాకతీయ యూనివర్సిటీలో జూని యర్లు, సీనియర్ల యుద్ధభేరి
Kakatiya University: ప్రజా దీవెన హనుమకొండ: సమాజంలో విద్యా వ్యవస్థకు ఎంతో గొప్ప గౌరవప్రదమైన స్థానం ఉందనేది నానుడి. కానీ ప్రస్తుత స మాజంలో విద్యావ్యవస్థతో పాటు విద్యార్థులు చెరబడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెకండ్ ఇయ ర్, థర్డ్ ఇయర్ చదువుతున్న వి ద్యార్థులకు మధ్య డైనింగ్ హల్లో చోటుచేసుకున్న యుద్ధభేరి సంఘ టనే ఎందుకు నిలువెత్తు నిదర్శనం గా నిలుస్తుంది అనడంలో అతిశ యోక్తి మాత్రం లేదు. యూనివర్సిటీ లో అకస్మాత్తుగా జరిగిన రెండు గ్రూపుల మధ్య గొడవలకు గల వివ రాలు పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది.
Students violence at Kakatiya University pic.twitter.com/Y6TvCwIib6
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) February 8, 2025
విద్యార్థులారా ఉన్నత చదు వులు చదువుకొని మంచి భవిష్య త్ దిశగా సాగాలని మీ తల్లితండ్రు లు కోరుకుంటుంటే మీరు మాత్రం ఈ తరహా వ్యవహారాలకు తెరతీసి జీవితాలు సర్వనాశనం చేసుకోవద్ద ని మేధావులు హితవు పలుకుతు న్నారు. ఎటు పోతున్నాయి మీ ఉన్నత చదువులు అంటూ ప్రశ్ని స్తున్నారు. హనుమకొండ జిల్లా కాక తీయ యూనివర్సిటీలో జూని య ర్లు, సీనియర్ల పరస్పర దాడుల వీడియో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థు లకు మధ్య డైనింగ్ హల్లో ఛాలెం జింగ్ తరహాలో గొడవలు ప్రారం భమై అవి దాడులకు దారి తీసే వరకు చేరుకున్నాయంటే విద్యా ర్థుల మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.