Madi Venkanna: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా కన్వీనర్ గా మేడి వెంకన్న ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్లగొండ జిల్లా చైర్మన్ బోడ స్వామి తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకొని మేడి వెంకన్నకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మేడి వెంకన్న మాట్లాడుతూ తన నియమకానికి సహకరించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్, జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ బోడ స్వామి జనరల్ సెక్రెటరీలు చిరుమర్తి ఉపేందర్,బోగారి రామకృష్ణ లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతినిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం అడుగులు వేస్తూ పార్టీని బలోపేతం చేస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కుడుతాల నాగరాజు, శ్రీనివాస,బాకీ శివ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.