Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cyber Crime: బురిడి కొట్టించిన సైబర్ కేటుగాళ్లు, ఏమార్చి రూ.10 కోట్లు కోట్టేశారు

Cyber Crime: ప్రజా దీవెన హైదరాబాద్: హైద రాబాద్ నగరానికి చెందిన ఓ సంస్థ ను సైబర్ కేటుగాళ్లు నిండా ముం చారు. సంస్థ ఉద్యోగులను అక్షరాల తో ఏమార్చి రూ. 10 కోట్లు కోట్టేశా రు. సదరు సంస్థను ఏమార్చి బురి డి కొట్టించిన వైనం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి చెందిన సదరు కంపెనీ హాంకాంగ్‌ నుంచి తమకు కావాల్సిన ముడిస రుకు కొనుగోలు చేస్తుంటుంది. లా వాదేవీలు పూర్తిగా ఈమెయిల్‌ ద్వా రానే జరుపుతుంటారు. హాంకాంగ్‌ సంస్థ తరఫున robert@ gmail. com ద్వారా హైదరాబాద్ కంపెనీ తో సంప్రదింపులు జరిపేవారు.

ఇటీ వల సరుకు డెలివరీ పూర్తయిన త ర్వాత ఒకరోజు హైదరాబాద్‌ సం స్థకు మెయిల్‌ వచ్చింది. ఆడిట్‌ కారణాల వల్ల తమ బ్యాంకు అకౌం ట్ మార్చాల్సి వచ్చిందని మెయిల్‌ లో పేర్కొన్నారు. తమకు రావాల్సి న బకాయిలు కొత్త బ్యాంకు అకౌం ట్‌కు బదిలీ చేయాలని సూచించా రు. వారి మెయిల్ చూసుకున్న హై దరాబాద్ సంస్థ కొత్త అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసింది. డబ్బు లు పంపిన వారం తర్వాత తమకు ఇంకా డబ్బు రాలేదని హాంకాంగ్‌ సంస్థ నుంచి హైదరాబాద్ కంపెనీకి సమాచారం ఇచ్చింది.

దాంతో ఖం గుతున్న హైదరాబాద్‌ సంస్థ ఉద్యో గులు వారం క్రితమే తాము డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశామని అందుకు సం బంధించిన వివరాలు పంపారు. అయితే ఆ అకౌంట్ తమది కాద ని డబ్బు పంపాలని చెప్పిన ఈ-మె యిల్‌ కూడా తాము పంపలేదని హాంకాంగ్‌ సంస్థ స్పష్టం చేసింది. దీంతో మోసపోయామని గ్రహించి న బాధిత కంపెనీ హైదరాబాద్‌ పోలీ సులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వి చారణ చేపట్టి సైబర్ నేరం జరిగిన ట్లు తేల్చారు. కేసు నమోదు చేసు కున్న పోలీసులు విచారణ చేపట్టి సైబర్ నేరం జరిగినట్లు తేల్చారు.