CM AravindKejriwal : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: దేశంలోనే సంచలనాల ముఖ్యమంత్రి అర వింద్ కేజ్రీవాల్ ను మట్టి కల్పించిన ఆ యోధుడు ఎవరో తెలుసా అం టే ఆ గేమ్ చేంజర్ అరవింద్ కేజ్రీ వాల్ పై గెలిచి సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యాడు. ఆయనే కేజ్రీ వాల్ పై విజయదుందుభి మోగిం చిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. ఈయన ఢిల్లీ మాజీ సీఎం, మాజీ కేంద్రమంత్రి సాహిబ్ సింగ్ వర్మ. సాహిబ్ కౌర్ దంపతుల కుమారు డు.ఆధిపత్య ‘జాట్’కు చెందిన రాజకీయ నాయకుడు కావడం విశేషం. 1977న 7 నవంబర్ న ఢిల్లీలో జన్మించిన ఈయనకు భార్య స్వాతి సింగ్, ఇద్దరు కు మార్తెలు, ఒక కుమారుడు ఉ న్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కిరోర్ మాల్ కాలేజీల్లో, ఢిల్లీ విశ్వవి ద్యాలయం నుండి బి.ఎ. (BA), ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి ఎం.బి.ఎ. (MBA) విద్య నభ్యసించారు.ఢిల్లీ పశ్చిమ లోక్ సభ నుంచి బీజేపీ ఎంపీగా ఉ న్నా డు. గతంలో ఎంపిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పలు పార్లమెంట్ కమిటీల్లో పనిచేశారు.ఢిల్లీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో లో క్ సభ ఎంపీ (2019) గా గెలుపొం దారు.ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని కల్లో సీఎం కేజ్రీవాల్ ను ఓడించి ‘గేమ్ చేంజర్’గా నిలిచాడు.
సీఎం కావడానికి ప్రధాన అర్హతలు: ఆర్ఎస్ఎస్ కుటుంబ నేపథ్యం, బీజేపీ మాజీ సీఎం కు మారుడు, ప్రముఖ జాట్ నాయ కుడు, ఢిల్లీ చరిత్రలోనే ఎంపీ గా అత్యధిక మెజార్టీతో గెలుపు, వి ద్యాధికుడు, పాలనా అనుభవం, భార్య తండ్రి కూడా మధ్య ప్రదేశ్ బీజేపీ అగ్రనేత, మరో అంకుల్ పశ్చిమ ఢిల్లీ మేయర్, అన్నింటికీ మించి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం, ప్రధాని మోదీని బలంగా ఎది రించిన నాయకుడు ‘అరవింద్ కేజ్రీవాల్’ పై గెలుపొందడం తదితర అంశాలు ఈయనకు ప్లస్ పాయిం ట్లుగా అవకాశo లేకపోలేదు.