Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Principal Apparao : ఘనంగా ఆంగ్ల భాష దినోత్సవ వేడుకలు.

Principal Apparao : ప్రజా దీవెన,కోదాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరోజినీ నాయుడు జయంతిని ఆంగ్లభాష దినోత్సవంగా జరుపుకోవాలనే ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని స్థానిక తేజ పాఠశాలలో సరోజినీ నాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ఆమె చిత్రపటానికి పాఠశాల ప్రిన్సిపల్ అప్పారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గడ్డ అయినా హైదరాబాదులో పుట్టి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని, అనేక కవితలు, రచనలను ఆంగ్ల భాషలో రచించి భారతకోకిలగా పేరు గాంచిన వీర వనితగా సరోజినీ నాయుడుని కొనియాడారు. పాఠశాల విద్యార్థులకు సరోజినీ నాయుడు జీవిత చరిత్రపై వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు అలాగే ఆంగ్ల ఉపాధ్యాయుడు రమేష్ అంగ్ల బాష ప్రముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ వై. సంతోష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ సోమ నాయక్, ఇన్చార్జులు రామ్మూర్తి, రేణుక,ఆంగ్ల ఉపాధ్యాయులు అశోక్,రమేష్, నవ్య ,నాగమణి,గోవిందు పాల్గొన్నారు.