Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TPCC chief Mahesh Kumar : యువతను మత్తులో ముంచారు

— కెటిఆర్‌, సంతోష్‌ కనుసన్నల్లో ఫామ్‌హౌజ్‌ దందాలు

— టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపణలు

TPCC chief Mahesh Kumar :  ప్రజా దీవెన, హైదరాబాద్: బీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ఫాంహౌజ్‌ కోళ్ళపందాల ఘ టన దుమారం రేగుతోంది. బీఆర్‌ ఎస్‌ హయాంలో కేటీఆర్‌, సంతోష్‌ కనుసన్న ల్లోనే పోచంపల్లి ఫాం హౌజ్‌ దందా నడిచిందని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరో పించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణలో యువతను మత్తు లో ముంచారని అన్నారు. తెలం గాణ రాష్టాన్న్రి క్యాసినో హబ్‌ గా కేటీఆర్‌ మార్చారని విమర్శించారు. బీఆర్‌ ఎస్‌ హయాంలో రాష్ట్రంలో రాక్షసపాలన సాగింది. కేటీఆర్‌ డ్రగ్స్‌ తో తెలంగాణను నాశనం చేశారు. బినావిూలకు క్యాసినో, కోళ్ల పందాలు అప్పగించారని అన్నారు. కేటీఆర్‌, సంతోష్‌ కుమా ర్‌ లకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా స్‌ రెడ్డి భాగస్వాములుగా ఉన్నా రని చెప్పారు. బీఆర్‌ ఎస్‌ హయాం లో సన్‌ బర్న్‌ పార్టీలో పేరుతో హైద రాబాద్‌ లో పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చిన చరిత్ర బీఆర్‌ ఎస్‌ నేత లదని విమర్శించారు.

 

జన్వాడ ఫాం హౌ జ్‌ కేసులో డ్రగ్స్‌ ఇచ్చిన కేసులో పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డికి లిందని అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. ఫాంహౌజ్‌ లలో క్యా సినో, పేకాట, కోళ్ల పందేలు ఆడి స్తూ తెలంగాణ సమాజాన్ని జూదం వైపు మళ్లిస్తున్నారని అన్నారు. కేటి ఆర్‌ అండతోనే ఇలాంటి పనులు జరుగుతున్నాయన్నారు.తెలంగాణ లో జరిగే అన్ని రకాల జూదాల కు కేటిఆరే నాయకుడు, బీఆర్‌ ఎష్‌ నేతలు ఏదో అవినీతిలో భాగ స్వాములే అన్నారు. అందరిపైనా విచారణ జరిపి తెలంగాణ యువ తను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.