CM A. Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అయిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (అంతర్భాగం) లోపలి ఏరి యా మొత్తాన్నీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు, నగరవాసులకు మెరు గైన మౌలిక సదుపాయాలు కల్పిం చేందుకు ప్రణాళికాబద్ధంగా ముం దుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు తెలియ జేస్తూ కీలక ప్రకటన చేశారు. ఇందు కు సంబంధించి ఇప్పటికే పైలెట్ ప్రా జెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా అంతటా నిర్వహిం చాలన్నారు.నానక్రామ్గూడలోని హెచ్ఎండీఏ (HMDA) కార్యాల యంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కోర్ అర్బన్ (Telan gana Core Urbun) అభివృద్ధి అంశాలను ముఖ్యమంత్రి సమీ క్షించారు. నగరంలో కొత్తగా మరో 7 ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదన లకు ఆమోదం తెలిపారు. ఈ సం దర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత, భవి ష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేం దుకు వీలుగా హైదరాబాద్ నగ రంలో గృహాలు, మంచినీటి సరఫ రా, విద్యుత్ సౌకర్యం, మురుగునీ టి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలి.
గ్రేటర్ హైదరాబాద్ ( Greater Hyder abad)లో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని వాహనదా రులకు ఇబ్బందులు లేకుండా చూ డాలి. కోర్ అర్బన్ ప్రాంతంలో చెరు వుల పునరుద్ధరణ, నాలాల విస్తర ణకు ప్రణాళికలు రూపొందించాలి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమై న మరో 7 కూడళ్లలో ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి, వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలి.ఈ సమావేశంలో మౌలిక సదుపాయాల సలహాదారు శ్రీని వాసరాజు, మున్సిపల్ అడ్మిని స్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ కమిషనర్ ఇలాం బర్తి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.