Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Tripathi : కేజీబీవీల పరిసరాలు పరి శభ్రంగా ఉంచుకోవాలి

Collector Tripathi : ప్రజా దీవెన, శాలిగౌరారం: విద్యార్థినిలు అనారోగ్యం పాలు కాకుండా కేజీబీవీ ల పరిసరాలతో పాటు వంట గది, ఇతర గదులను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించా రు.శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా శాలిగౌరారం కస్తూర్బా గాంధీ బాలి క విద్యాలయాన్ని ఆకస్మికంగాగ త నిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆమె వంటగదిని, డ్రైనేజీ ప్రాంతాన్ని పరి శీలించగా అవి రెండు అపరిశుభ్రం గా ఉండుట పై అసహనం వ్యక్తం చేస్తూ ఎప్పటికప్పుడు వంటగదిని, మురుగునీరు ప్రవహించే ప్రాంతా న్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూ చించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ విద్యార్థినీలతో ముఖాము ఖి మాట్లాడి వారికి అందిస్తున్న భో జనం, విద్య తదితర విషయాలపై అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీ పాఠశాలలో కోతుల బెడద ఉం దని ,తమకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని విద్యార్థినిలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్ష ణమే తన నిధుల ద్వారా సోలార్ పెన్సింగ్ ఏర్పాటు చేయిస్తానని జిల్లా కలెక్టర్ తెలిపారు.

 

అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో ఉన్న శాలిగౌరారం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తని ఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక వైద్యా రోగ్య కేంద్రం సేవల పట్ల జిల్లా కలెక్ట ర్ సంతృప్తి వ్యక్తం చేశారు.నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, గృహ నిర్మా ణ శాఖ పీడి రాజకు మార్, తది తరులు ఉన్నారు.