Bird flu: ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్ వద్ద పశుసంవర్ధక మరియు పశువైద్య శాఖ పోలీస్ శాఖ వారి సంయుక్త చెక్పోస్ట్ పనితీరు ఆకస్మికంగా సూపర్వైజరీ ఆఫీసర్ మరియు ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా పై పెంటయ్య శనివారం తనిఖీలు నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాపురం చెక్పోస్ట్ వద్ద 8 కోళ్ల రవాణా వాహనాలలో ఉన్న 17000 కోడిపిల్లలు ఆంధ్రనుండి తెలంగాణకు రాకుండా వెనక్కి పంపించటం పట్ల ఆయనచెక్ పోస్ట్ టీమ్ ని అభినందించార చెక్ పోస్ట్ వద్ద పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది మరియు కోదాడ మండలం, అనంతగిరి మండలం పశువైద్యాధికారులతో 24 గంటల తనిఖీ ఏర్పాటు చేయడం జరిగింది.
అని తెలంగాణలోకి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకకుండా శాఖ డైరెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేర ఆంధ్రను డి తెలంగాణకు కోళ్ల వాహనాలు కోళ్లు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు జిల్లాలో కోళ్ల సంరక్షణకు ఎప్పటికప్పుడు యజమానులతో మాట్లాడుతూ వ్యాధి సోకకుండా ముందస్తు సూచనలు చేస్తూ జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి నిరంతరం జిల్లా అంతటా పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు పౌల్ట్రీ యజమానులు ఎవ్వరూ బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలోఅనంతగిరి మండల పశువైద్యాధికారి డా సురేందర్ , కట్టకొమ్ముగూడెం పశువైద్యాధికారి డా శ్రీనివాస్ సిబ్బంది శరత్ పవన్ తదితరులు పాల్గొన్నారు