సీఎం రేవంత్ కీలక నిర్ణయం, కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు
CMrevanthreddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు ల జా రీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధి కారులను ఆదేశించారు. ప్రజా పా లన అర్జీలు, కుల గణనతో పాటు గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తు లు, మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలిం చే ప్రక్రియను వేగంగా పూర్తి చేయా లని చెప్పారు.ఇప్పటికే పలు మార్లు దరఖాస్తులకు అవకాశం ఇచ్చినప్ప టికీ, మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డులకు ఎందుకు రద్దీ ఉంటుం దని ముఖ్యమంత్రి ఆరా తీశారు. దరఖాస్తు చేసిన కుటుం బాలే మళ్లీ మళ్లీ చేస్తున్నాయని, అందుకే రద్దీ ఉంటుందని అధికారు లు వివరణ ఇచ్చారు. వెంటనే కార్డులు జారీ చేస్తే ఈ పరిస్థితి తలె త్తేది కాదని, ఆలస్యం చేయకుం డా వెంటనే కొత్త కార్డులు జారీ చేసేందుకు అవసర మైన చర్యలు చే పట్టాలని ఆదేశించారు.
అర్హులైన వారందరికీ రే షన్ కార్డులు ఇవ్వాల్సిందేనని, అయితే ఇప్ప టికే కార్డుల కోసం దర ఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీమళ్లీ దరఖా స్తులు చేయకుండా ప్రజ లకు అవగాహన కల్పించాలని ము ఖ్యమం త్రి సూచించారు.రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎన్నికల నియమావళి అ మలులో ఉందని, నియమావళి అమలులో లేని జిల్లాల్లో ముందు గా కార్డులను జారీ చేయాలని చెప్పారు. కోడ్ ముగిసిన తర్వాత అ న్ని జిల్లాల్లో కొత్త కార్డులు ఇవ్వాలని సూచించారు.
కొత్త కార్డులకు సంబంధించి పౌర సరఫరాల విభా గం తయారు చేసిన పలు డిజై న్లను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరిశీలించా రు.ఈ సమావేశంలో మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం సల హా దారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు ఆ శాఖ ఉన్న తాధికారులు పాల్గొన్నారు.