Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సైబర్ నేరాలపై పోలీసులు అప్రమ త్తత

–సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైద‌రాబాద్:సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సైబర్ నేరాల నియంత్రణ కోసం 1930 టోల్ ఫ్రీ నంబర్ పై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పిం చాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచించారు. పోలీసు లు కూడా ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. సమాజంలో మారుతున్న నేరాల రూపానికి అనుగుణంగా పరిపాలనా విధా నంలో మార్పులు తీసుకు రావాలని సీఎం కోరారు.
తెలం గాణ రాష్ట్రాన్ని సైబర్ భద్రత లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ముందు కు సాగుతుందని ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి చెప్పారు. సైబర్ నేరాలు కేవలం వ్యక్తిగత, ప్రభుత్వ స్థాయి లోనే కాకుండా ఆర్థిక వ్యవస్థపై కూ డా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నా యని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగా ణను సురక్షిత బిజినెస్ హబ్ గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.హైదరాబాద్ లో మంగళవారం జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025 కార్యక్ర మంలో ఐటీ మంత్రి శ్రీధర్ రెడ్డితో క‌ల‌సి రేవంత్ పాల్గొన్నారు. ఈ సం ద‌ర్భంగా ఆయ‌న మాట్లాడు తూ ఒకప్పుడు దోపిడీ చేయాలంటే దొంగలు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాల్సి వచ్చేద‌ని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిం ద‌ని అన్నారు సిఎం.

 

ఒక్క క్లిక్ తోనే సైబర్ నేరగాళ్లు ప్ర జలను నిలువు నా దోచేస్తున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసు లు ఇప్పటికే సైబర్ భద్రత ను మెరు గుపర్చడంలో అగ్రభాగాన ఉన్నార ని, కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి అవార్డు లు ఇచ్చిందని గుర్తు చేశా రు.అయితే, ఇప్పటివరకు చేసినవి సరిపోవు.. ఇంకా చాలా చేసేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొ న్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా సమాజంలో చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దీన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయ‌ ప‌డ్డారు. సైబర్ నేరాల నియంత్ర ణలో తెలంగాణ దేశానికి ఆదర్శం గా నిలుస్తుందనే నమ్మకం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సైబర్ భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా తెలం గాణను సురక్షిత రాష్ట్రంగా మారు స్తామ‌ని తేల్చి చెప్పారు.