–బిఆర్ఎస్ రెపరెపలాడుతోoది, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది
–తధ్యమైన ఉపఎన్నికల్లో సత్తా చాటాలి
–ఏడాది పాటు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
–బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో అధినేత కేసీఆర్
BRS KCR : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ సమాజం సామాజిక చారిత్రక అవసరాల దృష్ట్యా తెలంగాణ చరి త్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ అని మాజీ ముఖ్యమంత్రి, బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ పేర్కొన్నారు.
బిఆర్ ఎస్ పార్టీ మారిన పది స్థానా ల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయ మని స్పష్టం చేశారు. తధ్యమైన ఉ ప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటా లని పార్టీ శ్రేణులకు ఆయన పిలు పునిచ్చారు. బుధవారం తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావే శం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు, సిల్వర్ జూబ్లీ వేడుకలు, పార్టీ సంస్థాగత ఎన్నిక లు తదితర భవిష్యత్ కార్యచరణ పై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చే శారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓ టమి చెందగానే పార్టీ పని అయి పొందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారని, అందుకే 10 మంది ఎమ్మె ల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారని పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు.
రాష్ట్రంలో 100 శాతం మళ్లీ మన మే అధికారంలోకి రాబోతున్నామ ని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ గ్రాఫ్ పడిపోతోందని, ఈ సీఎంపై ప్రజల్లో ఇంతలా వ్యతిరేకత ఇంత తొందర గా వస్తుందనుకోలేదన్నారు. పోరా డి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కి పోతోందని, పాతికేళ్ల స్ఫూర్తి తో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకు నేందుకు పోరాడాలని సూచించా రు. ఒక్కసారి ఓడిపోయినంత మా త్రాన బీఆర్ఎస్ పడిపోయినట్లు కా దన్నారు. గతం గాయాల నుంచి కో లుకున్న తెలంగాణ ప్రజలు తిరిగి అవే కష్టాలపాలు అవుతున్నారు. గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయా లని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థ ల ఎన్నికల్లో పార్టీ కోసం కృషి చే యాలని పిలుపునిచ్చారు.
ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ.. పార్టీ ఆవిర్భవించి 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంలో సిల్వర్ జూబ్లీ వేడుక లు ఏడాది పాటు ఘనంగా నిర్వ హించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఇందు కోసం పార్టీ కమిటీలు వే యాలని, కమిటీలకు ఇన్చార్జిగా హరీశ్ రావుకు బాధ్యతలు అప్ప గిస్తున్నట్లు చెప్పారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా పటిష్టం చేయాలన్నారు. పదేళ్లుగా పార్టీ నిర్మాణంపై సరిగ్గా ఫోకస్ చేయలేకపోయామని ఇకపై దానిపై దృష్టి పెడతామన్నారు. త్వరలోనే విద్యార్థి, మహిళ సహా పార్టీ అను బంధ విభాగాలను మరింత పటి ష్టం చేస్తామన్నారు. అందుకోసం సీనియర్ పార్టీ నేతలతో కూడిన సబ్ కమిటీ లను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై చేపట్టబోయే భవిష్యత్ పోరాటా లు, పార్టీ కార్యాచరణపై ఏప్రిల్ 10వ తేదీన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహించబోతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. అదే రోజు నుంచి బీఆర్ఎస్ సభ్యత్వ నమో దు కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు.