SP Sarath Chandra Pawar : ప్రజాదీవెన, నల్లగొండ: సమస్యలను పరిస్కరించడానికే, రేపు డిండీ పోలీస్ స్టేషన్ లో మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.
జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంకోసం ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను, పరిష్కరించేలా డిండి పోలీసు స్టేషన్లో ఉదయం 11గంటలకు మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని చెప్పారు. పోలీసు స్టేషన్లలోనే బాధితులు ఫిర్యాదుల పరిశీలించి, సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. డిండి మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను వివరించేందుకు, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.