Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMrevanthreddy : ఫ్లాష్ ఫ్లాష్ , సీఎం చేతికి విద్యా కమిషన్ నివేదిక

 ఫ్లాష్ ఫ్లాష్ , సీఎం చేతికి విద్యా కమిషన్ నివేదిక

CMrevanthreddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలో పేతం చేయడంపై విద్యా కమి షన్ రూపొందించిన నివేదికను ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డికి అందజేసింది. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు , చారగొండ వెంకటేష్, జ్యోత్స్నా శివారెడ్డి జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో ము ఖ్యమంత్రిని కలిసి నివేదికను అంద జేశారు.

ప్రీప్రైమరీ నుంచి యూని వర్సిటీ స్థాయి వరకు సాంకేతిక విద్యతో పాటు సమగ్ర విద్యా విధా నాన్ని రూపొందించేందుకు విద్యా కమిష న్‌ను ఏర్పాటు చేయగా, కమిషన్ ప్రస్తావించిన అంశాలపై ముఖ్య మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ స్కూ ళ్లతో పాటు అన్ని ప్రభు త్వ పాఠశాలల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సభ్యులు ము ఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.

ప్రభు త్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు, పాఠ శాల నిర్వ హణ సమస్యలను సీఎం వివరిం చారు.విద్యా విషయా ల్లో అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రభు త్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవస రమైన అన్ని చర్య లు తీసుకుంటా మని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.